17 June, 2026 | 8:40 PM

Breaking News

20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •  

ఈనెల 12న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలి

09-10-2025 08:42 PM

డాక్టర్ఏ. అప్పయ్య..

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి..

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనలకు అనుగుణంగా ఈ నెల 12 ఆదివారం రోజు అప్పుడే పుట్టిన పాప నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రుల బాధ్యత తీసుకొని పల్స్ పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించి, పోలియో నిర్మూలనకు సహకరించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో గత 14 సంవత్సరంల నుండి పోలియో కేసు నమోదు కానప్పటికీ రాష్ట్రంలోని పట్టణ జనాభా అధికంగా ఉన్న హనుమకొండ జిల్లాతో పాటు మొత్తం ఐదు జిల్లాలలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఈ 12న జిల్లాలో 0 నుండి 5 సంవత్సరాల వయసు గల(84301) పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు (472) బూతులు (17) బస్టాండ్లు, రైల్వే స్టేషన్ లాంటి ట్రాన్సిట్ పాయింట్లు, మొబైల్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా ఇమునైజేషన్ అధికారి డాక్టర్ ఏ. మహేందర్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారని, జిల్లాకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ తయారు చేశారని అన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా గురువారం జూమ్ ద్వారా వైద్యాధికారులు, సూపర్వైజర్స్ తో డీఎంహెచో, డీఐఓ సమావేశం నిర్వహించారు.