calender_icon.png 23 November, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజే లెవన్‌దే విజయం

10-02-2025 01:31:13 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ఉప్పల్లోని రాజీవ్‌గాంధీ ఇంట ర్నేషల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్(ప్రెసిడెంట్ లెవన్) జట్టు పై న్యాయమూర్తుల (ప్రధాన న్యాయమూర్తి లెవన్) జట్టు 93 పరుగుల తేడా తో విజయం సాధించింది. తొలుత బ్యా టింగ్ చేసిన సీజే లెవన్ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 167 పరుగులు చేసింది. ప్రెసిడెంట్ లెవన్ జట్టు 74 పరుగులకే ఆలౌ టైంది.

జస్టిస్ నర్సింగ్‌రావు నందికొండ, జస్టిస్ మధుసూదన్‌రావు బౌలింగ్, బ్యా టింగ్‌లో ప్రతిభ చూపారు. జస్టిస్ సురేందర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ మ్యాచ్‌ను ప్రారంభించారు. జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ మాధవిదేవి, జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమా ర్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి, జస్టిస్ శ్రీనివాస్‌రావు, హెచ్సీఏఏ అధ్యక్షుడు ఏ రవీం దర్‌రెడ్డి, కార్యదర్శులు శాంతిభూషణ్, సంజీవ్‌రెడ్డి, అదనపు కార్యదర్శి నవీన్ పాల్గొన్నారు.