24 April, 2026 | 12:03 PM

Breaking News

అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి   •  

ఢిల్లీకి సీఎం

19-09-2025 12:38 AM
  1. రాష్ట్రానికి పెట్టుబడులు సేకరించడమే లక్ష్యం 
  2. నేడు అమెజాన్, కార్ల్స్‌బర్గ్, గోద్రెజ్ తదితర కంపెనీల ప్రతినిధులతో భేటీ 
  3. బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ 12వ వార్షిక ఫోరానికి హాజరు

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తెలంగాణకు పెట్టుబడులను సమీకరించడమే లక్ష్యంగా ఆయన వివిధ కంపెనీ ల ప్రతినిధులతో శుక్రవారం భేటీ కానున్నారు. ముందుగా ఉదయం 11 గంట లకు తాజ్ ప్యాలెస్ హోటల్‌లో న్యూ జెర్సీ గవర్నర్ ఫిలిప్ డీ మర్ఫీతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఉదయం 11:30 గంటలకు బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ 12వ వార్షిక ఫోరంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు ఆమెజాన్, కార్ల్స్‌బర్గ్, కార్లుల్, గోద్రేజ్, ఉబర్ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్రానికి పెట్టుబ డులకు సంబంధించిన అంశాలపై విడివిడిగా సమావేశమై చర్చిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు, సీఈవో బోర్జ్ బ్రెండేతో ప్రత్యేక భేటీ కానున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పెద్దలతోనూ సమావేశమవుతారని పార్టీ వర్గా లు తెలిపాయి.