calender_icon.png 9 July, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

08-07-2025 07:50:20 PM

న్యూఢిల్లీ: ఢిల్లీలోని వాణిజ్య భ‌వ‌న్‌లో కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌ తో ముఖ్య‌మంత్రి రేవంత్ సమావేశమై తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టుల విషయంపై చర్చించారు. అలాగే జేడ్ఐఎస్‌సీ (Zaheerabad Industrial Smart City) అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. జ‌హీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమ‌లు కార్యక్రమం (NICDIT) కింద ఆమోదించిన రూ.596.61 కోట్లను సత్వరం విడుద‌ల చేసి అవ‌స‌ర‌మైన నీటి స‌ర‌ఫ‌రా, విద్యుత్, ఇత‌ర వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ఆర్థిక స‌హాయం చేయాల‌ని సీఎం పేర్కొన్నారు.

హైద‌రాబాద్‌ - వ‌రంగ‌ల్ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యానికి నిధులు మంజూరు చేయాల‌ని అభ్య‌ర్ధించిన ముఖ్యమంత్రి, హైద‌రాబాద్‌ - విజ‌య‌వాడ పారిశ్రామిక కారిడార్ ఫీజుబిలిటీని అధ్య‌య‌నం చేస్తున్న‌ట్లు కేంద్ర మంత్రికి వివరించారు. తెలంగాణ ప్ర‌భుత్వం ఆదిభ‌ట్ల‌లో అత్యున్న‌త‌మైన మౌలిక వ‌స‌తుల‌తో ప్ర‌త్యేక‌మైన ర‌క్ష‌ణ‌, ఏరోస్పేస్ పార్క్‌ను ఏర్పాటు చేసింద‌ని వివరిస్తూ, హైద‌రాబాద్‌ - బెంగ‌ళూర్ పారిశ్రామిక కారిడార్‌ను ఏరో-డిఫెన్స్ కారిడార్‌గా మంజూరు చేయాల‌ని రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. 

పెట్టుబ‌డుల‌కు సిద్ధంగా ఉన్న వంద ప్ల‌గ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పిస్తామ‌ని, కేంద్ర ప్ర‌భుత్వం వాటికి మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని గోయల్ ని కోరారు. ఈ స‌మావేశంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ఏపీ జితేంద‌ర్ రెడ్డి, ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.