calender_icon.png 9 July, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 49 రద్దు చేసి ఆదివాసీ హక్కులను కాపాడాలి

09-07-2025 12:41:59 AM

గవర్నర్‌ను కోరిన మాజీ ఎంపీ సోయం బాపూరావు 

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 8 ( విజ యక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా టైగర్ కన్జర్వేషన్ పేరిట జారీ చేసిన జీవో 49 ఆదివాసి హక్కులను కాలరాసే విధంగా ఉంద ని ఈ జీవోను వెంటనే రద్దుచేసి  ఆ ప్రాంతం లో నివసించే గిరిజన, గిరిజనేతరుల కు స్వేచ్ఛ కల్పించాలని మాజీ ఎంపీ సోయం బాపూరా వు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

మంగళవారం హైదరాబాదులోని గవర్నర్ నివాస గృహమైన రాజ్ భవన్ లో ఆదివాసీ నాయకులతో కలిసి  గవర్నర్ తో ఆదివాసుల సమస్యల గురించి చర్చించారు. కుమ్రం భీం జిల్లాలోని ఆసిఫాబాద్,కాగజ్ నగర్ డివిజన్ల ను ఏకపక్షం గా టైగర్ కన్జర్వేషన్ లో కలపడం వల్ల అడవులు అటవీ భూములను నమ్ముకొని బతికే గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లుతుందని అన్నారు.

ఇప్పటికే ఈ జిల్లాలో జీవో 49 రద్దు చేయాలని ఆందోళనలు చేస్తున్నారని,  దీనివల్ల 339 ప్రభావిత గ్రామాల్లో  ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. గవర్నర్ ను కలిసిన వారిలో  అఖిల భారతీయ గోండ్వానా మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు సిడం అర్జు మా స్టర్,జిల్లా మేడి కురిసేంగా మోతిరాం , రాజ్ గోండ్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్,   రాజ్ గోండ్ సేవ సమితి జిల్లా కార్యదర్శి మాడవి నర్సింగ్ రావుమానవ హక్కుల జిల్లా అధ్యక్షులు ఆత్రం లింగారావ్ ఉన్నారు.