10 April, 2026 | 2:46 PM

Breaking News

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •  

నేడు స్వగ్రామానికి సీఎం రేవంత్‌రెడ్డి

02-10-2025 01:11 AM
  1. కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకలు
  2. ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం తన స్వగ్రామం నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. అందుకు అధికార యంత్రాంగం భద్రత ఏర్పాట్లను సిద్ధం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఎన్నికల నియమావళికి లోబడి అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామానికి రెండోసారి ముఖ్యమంత్రి హోదాలో రానున్నారు.