28 June, 2026 | 2:04 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

‘గేట్‘ లో ర్యాంకు సాధించిన శ్రీచందనను అభినందించిన కలెక్టర్

24-11-2025 12:00 AM

నిజామాబాద్, నవంబర్ 23 :(విజయ క్రాంతి): ‘గేట్‘ అర్హత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జి.శ్రీచందనను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. భీమ్గల్ మండలం జాగిర్యాల్ గ్రామానికి చెందిన జి. దేవేందర్, స్రవంతి దంపతుల కుమార్తె అయిన శ్రీచందన గేట్ ప్రవేశ పరీక్షలో 81.67శాతం మార్కులతో 302 ర్యాంకు సాధించింది.

ఈ సందర్భంగా శనివారం ఆమెను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతగా ప్రిపేర్ అయి, తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించడం అభినందనీయమని అన్నారు. ఇదే పట్టుదలను కనబరుస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు.