27-10-2025 12:43:19 AM
మంచిర్యాల, అక్టోబర్ 26 (విజయక్రాం తి): నస్పూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న బాలసదనము భవన నిర్మాణ పనుల ను కలెక్టర్ కుమార్ దీపక్ ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. బాలల పరిరక్షణ, ఆశ్రయం కోసం మిషన్ వాత్సల్య అంచనా నిధులతో ప్రభుత్వం రూ. 1.34 కోట్లతో నిర్మిస్తున్న పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.