17 June, 2026 | 4:34 PM

Breaking News

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు   •   అంతర్రాష్ట్ర బస్సు సర్వీస్ ప్రారంభం   •   తంగళ్లపల్లిలో ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు.. యూరియా యాప్ అమ్మకాలపై అవగాహన   •   కలెక్టర్.. టీచర్ అయ్యారు   •   ఆదివాసుల మధ్య చిచ్చు పెడుతున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   వదలపర్తి గ్రామంలో మురికి కాలువలో పూడికతీత   •   అనారోగ్యంతో మరణించిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి చెక్కును అందజేత   •   శ్రీ కోదండ రామాలయంలో పునర్వసు నక్షత్ర పూజలు   •   మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి   •   జిల్లా కేంద్రంలో కోతుల బెడద.. భయాందోళనలో ప్రజలు   •  

ఎమ్మెల్యేపై వస్తున్న వదంతులు నమ్మొద్దు

27-10-2025 12:44 AM

మార్కెట్ కమిటీ చైర్మన్ పద్మ

మంచిర్యాల, అక్టోబర్ 26 (విజయక్రాంతి) : మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మ అన్నారు. ఆది వారం ఎంఎల్‌ఏ ఇంటి వద్ద మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్ మండలాలకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఆర్టీఏ మెంబెర్ అంకతి శ్రీనివాస్ తో కలిసి 80 మందికి రూ. 26,76, 500 విలువైన చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే స్వల్ప అనారోగ్య కారణంగా అందుబాటులో లేకున్నా నియోజక వర్గ ప్రజల గురించి నిరంతరం ఆలోచిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ప్రజలకు అందేలా చూస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై అధికారులతో ఫోన్ మాట్లాడుతూ పరిష్కారానికి ఆదేశాలిస్తున్నారని, అలాంటి వ్యక్తిపై విమర్శకులు ఆరోగ్యం బాగోలేదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారి మాటలు ఎవ రూ నమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, హేమలత, సూరిమిల్లా వేణు, సంపత్ రెడ్డి, డేగ బాపు, కొట్టె శంకర్, ముని తదితరులు పాల్గొన్నారు.