17 April, 2026 | 3:31 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు

20-05-2025 01:50 PM

హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Kalvakuntla Chandrashekar Rao)కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపినట్లు వెల్లడించింది. జూన్5న విచారణకు రావాలని కేసీఆర్ కు నోటీసుల్లో తెలిపారు. కేసీఆర్ తో పాటు హరీశ్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Etela Rajender) కు నోటీసులు పంపారు. జూన్ 6న విచారణకు రావాలని హరీశ్ రావుకు నోటీసులు తెలిపారు. జూన్ 9న విచారణకు రావాలని ఈటల రాజేందర్ కు నోటీసులు పంపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghose Commission) ఎదుట హాజరుకావాలని సమన్లు జారీ చేశారు. కమిషన్ కార్యాలయంలో విచారణకు రావాలని తెలిపారు. కేసీఆర్ హయాంలో నీటిపారుదలశాఖ మంత్రిగా తన్నీరు హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ పనిచేశారు.