21 April, 2026 | 5:41 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

తండ్రి మూర్ఖత్వంతో 28 రోజుల చంటి పాప ఊపిరాడక మృతి

20-05-2025 07:54 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): తండ్రి మూర్ఖత్వం, నిర్లక్ష్యంతో 28 రోజుల వయసుగల చంటి పాప మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో చోటుచేసుకుంది. ఖానాపూర్ సీఐ సిహెచ్ అజయ్ తెలిపిన వివరాల ప్రకారం... ఖానాపూర్ పట్టణానికి చెందిన సుభాష్ నగర్ కాలనీలో అలకుంట శేఖర్ తన భార్య సుజాత మంగళవారం ఉదయం వారి చంటి పాపను పక్కన పడుకోబెట్టుకుని ఉండగా, ఉదయం సుమారు 5 గంటల ప్రాంతంలో భర్త శేఖర్ ఆమె పక్కన నిర్లక్ష్యంగా పడుకోవడంతో పసికందు అయిన 28 రోజుల చంటి పాప వారి బరువుకు ఊపిరాడక మృతి చెందిందని ఎస్సై తెలిపారు. ఆలకుంట సుజాత తల్లి అల్లెపు రాజమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు.