10 April, 2026 | 12:19 AM

జాతీయ గేయం కాంగ్రెస్ వక్రీకరించింది

08-11-2025 12:22 AM

బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఆరోపణ

న్యూఢిల్లీ, నవంబర్ 7: మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ గేయాన్ని ఉద్దేశపూర్వకంగానే వక్రీకరించారని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఆరోపించారు. 1937లో మతపరమైన సున్నితత్వాన్ని శాంతింపజేయడానికి దుర్గాదేవిని కీర్తిస్తున్న చరణాలను తొలగించారని ఆయన తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలను ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు సీఆర్ కేశవన్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వందేమాతరం కుదించబడిన భాగాన్ని మాత్రమే స్వీకరించిందని, దుర్గాదేవిని స్తుతించే చరణాలను ఉద్దేశపూర్వకంగా తొలగించిందని ఆయన ఆరోపించారు.