20 March, 2026 | 9:05 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

20-07-2024 12:05 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, జూలై 19 (విజయక్రాంతి): ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్ధానాలు, హామీల అమలులో విఫలమైందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిరహించిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే సం స్థాగత ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి బు ద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు. సం స్థాగత ఎన్నికలకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

బీజేపీలో పనిచేసే నిమ్నస్థాయి కార్యకర్త కూ డా అత్యున్నత స్థానాలకు ఎదిగే అవకాశం ఉన్నదన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగానే అధికార పార్టీ బీజేపైపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఐక్యంగా, ధైర్యంగా ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చా రు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందం, జిల్లా నాయకులు ఆది నాథ్, వేణుగోపాల్, నగేష్, జోగు రవి, దినే ష్ మాటోలియా, అంకత్ రమేష్, బోయర్ విజయ్, మయుర్ చంద్ర, లాలా మున్నా, మానాజీ, దయాకర్ నాయకులు పాల్గొన్నారు