11 June, 2026 | 11:30 AM

సింగరేణి జీఎంను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

13-09-2025 08:59 PM

మందమర్రి (విజయక్రాంతి): ఏరియా సింగరేణి నూతన జీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎన్ రాధాకృష్ణను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. శనివారం జీఎం కార్యాలయంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు  పుల్లూరు లక్ష్మణ్, యువజన కాంగ్రెస్ నాయకులు మహంత్ అర్జున్ కుమార్, ఓరుగంటి సురేందర్, సాయి పాల్గొన్నారు.