06-08-2025 06:39:14 PM
వలిగొండ (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలను ఆమోదించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేపట్టారు. కాగా ఈ ధర్నాకు భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) ఆధ్వర్యంలో వలిగొండ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లి ధర్నాలో పాల్గొన్నారు.