11 May, 2026 | 12:18 PM

Breaking News

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •  

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ విజయానికి సమష్టి కృషి

10-08-2025 04:59 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కృషి. అంజన్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు చురుకుగా కృషి చేస్తున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, అభివృద్ధి లక్ష్యాలను విస్తృతంగా చేరవేయడానికి శ్రీనివాస్, కృష్ణ, కృష్ణకుమార్, మోషిన్, ఉర్వశి, గోదాసి కుమార్, ఆకాష్, గణేష్ యాదవ్, సతీష్ తదితరులు బృందంగా శ్రమిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు విని, వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తూ, ఓటర్లలో నమ్మకం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు సాధించాలని, జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి పథాన్ని కొనసాగించాలని ఈ బృందం సంకల్పం వ్యక్తం చేస్తోంది.