15 April, 2026 | 1:16 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జనగామ చౌరస్తాలో ఉద్రిక్తత

10-01-2026 01:42 PM

హైదరాబాద్: జనగామ(Jangaon) చౌరస్తాలో కాంగ్రెస్ నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో ఓ కాంగ్రెస్ నాయకుడి తలకు గాయాలయ్యాయి. కేటీఆర్ కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నాయకులు(Youth Congress leaders) రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరసన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. పురపాలక ఎన్నికలపై సన్నద్ధంపై కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.