14 July, 2026 | 7:16 PM

Breaking News

ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •  

చైనా మాంజా అమ్మినా, ఉపయోగించిన కఠిన చర్యలు

10-01-2026 12:56 PM

మద్నూర్ ఎస్సై రాజు

మద్నూర్, (విజయక్రాంతి): మద్నూర్ డోంగ్లీ  ఉమ్మడి మండల వ్యాపారులు చైనా మాంజా అమ్మినా, ఉపయోగించిన కఠిన చర్యలు తీసుకుంటామని మద్నూర్ ఎస్సై రాజు  వెల్లడించారు. శనివారం మద్నూర్ మండల కేంద్రంలోని  పలు కిరాణా షాపులను సిబ్బంది తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై  మాట్లాడుతూ... ఎవరైనా చైనా మాంజ అమ్మినా, ఉపయోగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ చైనా మంజా వాడకం ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, పక్షిజీవులకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోందన్నారు. మంజా పదునుగా ఉండటం వలన ద్విచక్ర వాహనాలు నడిపే వ్యక్తుల మెడ, చేతులు తీవ్రంగా గాయపడి చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చైనా మంజా తయారీ, విక్రయం, నిల్వ, వినియోగం పూర్తిగా నిషేధించబడిందని, ఉపక్రమిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఎవరైనా చైనా మాంజా అమ్మిన కలిగి ఉన్నట్లయితే సమాచారం అందించాలన్నారు.అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.