31 August, 2026 | 10:24 AM

Breaking News

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •   ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా పుల్లయ్య   •   గద్వాల మార్కెట్ యార్డులో గంజాయి పట్టివేత..!   •   ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు చాటేలా లేజర్‌ షో   •   బీసీ సంక్షేమ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలిగా పానుగుళ్ల సుజాత   •   మాదాపురంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు   •  

మోదీని విమర్శిస్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

01-09-2025 01:25 AM
  1. బీజేపీ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్

రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

ముషీరాబాద్, ఆగస్టు 31(విజయక్రాంతి): ప్రధాని నరేంద్రమోదీ, ఆయన తల్లిపై అనుచిత వాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలకు దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ అన్నారు.

ఈ మేరకు ఆదివారం బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ రమేష్ రామ్ ఆధ్వర్యంలో ప్రాగాటూల్స్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీ తల్లిపై చేసిన  అనుచిత వాఖ్యలను ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యఅథితిగా హాజరైన భరత్ గౌడ్ మాట్లాడుతూ... రాహు ల్ గాంధీకి రాజకీయాలు తప్ప, భారతీయ సాంస్కృతి సంప్రదాయాలు తెలియవని,  అందువల్లే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

కేవలం రాజకీయ లబ్దికోసమే బీజేపీ అగ్రనేతలపై తప్పుడు విమర్శలు, ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు తప్పా ప్రజలకు మేలు చేయాలనే ఆకాంక్ష కాంగ్రెస్ నేతలకు లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో దేశ ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు, కార్పొరేటర్లు రవిచారి, సుప్రి యా నవీన్ గౌడ్, బీజేపీ డివిజన్ అధ్యక్షులు రాజశేఖర్, కంచి ముదిరాజ్, పార్టీ నాయకులు గడ్డం నవీన్, కృష్ణ, నందగిరి నర్సింహ తదితరులు పాల్గొన్నారు.