17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

త్యాగం చేసిన కుటుంబంపై కుట్రలు

22-12-2025 12:48 AM

నాగర్ కర్నూల్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): దేశ స్వాతంత్య్రానికి ముందు ప్రజలను చైతన్యం చేయడానికి స్థాపించిన నేషనల్ హెరాల్ పత్రికను సాకుగా చేసుకుని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమంగా కేసులు నమోదు చేయడం కేంద్ర ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని ఎక్స్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా డిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ధర్నాలో ముఖ్యలు పాల్గొని మాట్లాడారు.

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో త్యాగాలు చేశారని, అర్హత కలిగిన విద్యావేత్తకు ప్రధాని పదవి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని వదులుకున్న చరిత్ర ఉందని గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తూ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు పోరాటం కొనసాగాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

తప్పుడు కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ కుమార్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.