10 May, 2026 | 9:25 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ లింగం

27-11-2024 01:27 PM

జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల కేంద్రంలో వంటేరు సందీప్ రెడ్డి వయస్సు 32 సంవత్సరాలు,రెస్టారంట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కొన్ని నెలల నుండి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని నమ్మదగిన సమాచారంపై జగదేవపూర్ పోలీసులు బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ లింగం లొకేషన్ ద్వారా అతని ఇంటికి వెళ్లి ఇంటి డోరు పగలగొట్టి ఉరి నుండి కిందికి దించి అతను అపస్మారక స్థితిలో ఉండగా వెంటనే సిపిఆర్ చేసి స్పృహ రాగానే గజ్వేల్ ఆసుపత్రికి వారి బంధువులతో పంపించారు.

అక్కడ ప్రథమ చికిత్స చేసి తదుపరి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ప్రస్తుతం సందీప్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు.సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడినందుకు సందీప్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, కానిస్టేబుల్ లింగమును అభినందించారు.త్వరలో పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా రివార్డు అందజేయడం జరుగుతుందని గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.