15 April, 2026 | 12:35 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పత్తి కొనుగోలు చేయాలి

30-12-2025 01:16 AM

నల్లగొండ జిల్లా చండూరులో రైతుల ఆందోళన

చండూరు, డిసెంబర్ 29 (విజయక్రాంతి): పత్తి కొనాలంటూ నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని బంగారి గడ్డ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. బంగారిగడ్డ ప్రధాన రహదారి వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

పత్తి పంటను తీసుకోబోమని మిల్లు యజమానులు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి వాహనాల్లో కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే, తీరా పత్తిని కొనుగోలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతామని సర్ది చెప్పారు.