3 July, 2026 | 10:09 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఇల్లందు ఏరియాలో గైర్హాజరీ ఉద్యోగులకు కౌన్సెలింగ్

07-08-2025 12:49 AM

ఇల్లెందు, ఆగస్టు 6 (విజయక్రాంతి):సింగరేణి ఇల్లందు ఏరియాలో విధులకు గైర్హాజరవు తున్న కార్మికులకు యాజమాన్యం బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించింది. 1 జనవరి నుండి జూన్ వరకు 80 మస్టర్ల కంటే తక్కువ హాజరు ఉన్న 11 మంది ఉద్యోగులకు అధికారులు ఓ.సి.ఓ.ఏ క్లబ్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. గైర్హాజరీతో వేతనం నష్టపోవడమే గాక, ఉత్పత్తి లక్షానికి ఆటంకం ఏర్పడుతుందని జీఎం వి.కృష్ణయ్య తెలిపారు. విదులు సక్రమంగా చేయకపోతే కలిగే అనర్ధాలను వివరించారు.

గైర్హాజరీకి గల కారణాలను తెలుసుకుని, సలహాలు, సూచనలు చేశారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విధులకు సక్రమంగా హాజ రయ్యే ఉద్యోగులకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని జీ.యం తెలిపారు. గతంలో మాదిరి కష్టమైన పనులు ప్రస్తుతం సింగరేణిలో లేవని, ప్రతి ఉద్యోగి హాజరు శాతాన్ని పెంచుకుని సంస్థ అభివృద్ధిలో భాగ స్వామికావాలని సూచించారు.

ప్రతి ఉద్యోగి నెలలో 22 మస్టర్లు విధిగా పూర్తి చేయాలని జీ.యం వి.కృష్ణయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ అధికారి జాకీర్ హుస్సేన్, ఎజియం(ఐఇ) గిరిధర్ రావు, డీజిఎం పర్సనల్ అజ్మీర తుకారాం, డీజిఎం (ఇ&యం.) సి.హెచ్.పి. క్రిస్తోపర్, డివైసియంఓ నరసింహరావు, అడిషనల్ మేనేజర్ కే.ఓ.సి. బ్రహ్మం, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ నజీర్ అహ్మద్, సంక్షేమ అధికారులు, ఇతర ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.