15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నేత కార్మికులకు రూ.33 కోట్లు

21-11-2025 01:18 AM

చేనేత జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి) : కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నేతన్న రుణమాఫీ ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి రూ. 33 కోట్లు విడుదల చేశారని జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేతన్న సంక్షేమం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి నేత కార్మికుల తరఫున మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వ నిర్ణయాల వలన నేత కార్మికులకు నిరంతర ఉపాధి లభిస్తోందని, అందులో భాగంగా టెస్కోకు రూ.588 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని తెలిపారు. సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, హన్మకొండ జిల్లాల్లోని 130 ఎంఏసీఎస్, 56 ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల ద్వారా ఇందిరా మహి ళా శక్తి పథకం కింద సహాయక సంఘాల మహిళా సభ్యులకు అందించే చీరల ఉత్పత్తి జరిగిందని తెలిపారు. 

నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.168 కోట్లతో తెలంగాణ చేనేత అభయహస్తం పథకంలో భాగంగా మూడు ముఖ్య మైన పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. నేతన్న భరోసా పథకంలో భాగంగా కనీసం 50 శాతం ఉత్పత్తి చేసిన నేత కార్మికులకు ఏడాదికి రూ.18,000, అనుబంధ కార్మికులకు రూ.6,000 ప్రోత్సాహం అంది స్తున్నట్టు పేర్కొన్నారు.