10-01-2026 08:15:38 PM
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలకు శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్టాండ్ లో రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఇంటి బాట పట్టడంతో నిర్మల్ బస్టాండ్ పిల్లలు తల్లిదండ్రులతో బస్సులో ప్రయాణించేందుకు నానా అవస్థలు పడ్డారు. రద్దీ ఎక్కువైనప్పటికీ బస్సులు సరిపోకపోవడంతో బస్సు రాగానే పరుగులు తీస్తూ ఇంటికి వెళ్లేందుకు పోటీపడ్డారు.