12 July, 2026 | 2:16 PM

Breaking News

రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •   42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు   •   "సర్" ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి   •   మద్రాస్ తండాలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక   •   గాయని జానకి మృతికి విజయ్, నటులు, సంగీతకారులు సంతాపం   •   గాయని ఎస్.జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

పథకాల్లో కోతలు.. ఉద్యోగులకు వాతలు

23-07-2025 01:06 AM

- హోంగార్డులకు వెంటనే వేతనాలు చెల్లించాలి

- మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో కోతలు విధిస్తూ, ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా వాతలు పెడుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశా రు. రాష్ట్రంలోని హోగార్డులకు జీతాలకు రాక ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నెల మొదలై 22 రోజు లు గడస్తున్నా హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని విమర్శించా రు.

వెంటనే హోంగార్డుల కు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభలో తెలంగాణ తలసరి ఆదాయంపై ఈ నెల 21న సమాధానమిస్తూ 2013 నుంచి 2023- వరకు తెలంగాణ రాష్ర్టం తలసరి ఆదాయంలో 84.3 శాతం వృద్ధి సాధించిందని తెలిపారని, కేసీఆర్ పాలనలో తలసరి ఆదాయంలో తెలంగాణ దూసుకెళ్లిందని హరీశ్‌రావు అన్నారు. ఇందుకు కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు ప్రధాన కారణాలని చెప్పారు.