31 March, 2026 | 2:07 PM

Breaking News

వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •   పట్టాలు తప్పిన గూడ్స్.. ట్రాక్‌పై అడ్డంగా పడిన పాల ట్యాంకర్   •   ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం   •  

క్షేత్రస్థాయి పరిశీలనతోనే డీసీసీ ఎన్నిక

11-10-2025 07:40 PM

ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్ కుమార్..

డీసీసీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నికపై 'క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందని ఏఐసీసీ ప్రతినిధి, డీసీసీ ఎన్నిక ఇంచార్జ్ డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయ ఆవరణలో ముఖ్య నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్ష ఎన్నిక నిర్వహణపై వివరించారు. 19వ తేదీ వరకు ఎన్నిక నిర్వాహన ఉంటుందని తెలిపారు. అధ్యక్ష ఎంపిక కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు కార్యకర్తల అభిప్రాయ సేకరణతో పాటు సాధారణ ప్రజల, మేధావుల అభిప్రాయాలను సేకరించడం జరుగుతుందని వివరించారు.

ఎన్నిక నిర్వహణపై సేకరించిన అభిప్రాయాలను, అభ్యర్థుల వివరాలను అధిష్టానానికి నివేదిక అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో ఆయనతో పాటు పిసిసి పరిశీలకులు శ్రీనివాస్, అనిల్ కుమార్, జ్యోతి, పిసిసి ఉపాధ్యక్షురాలు సుగుణ, ఎమ్మెల్సీ దండే విట్టల్, డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్ ఉన్నారు.