26-10-2024 12:00:00 AM
ఒమన్: ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ ఆసియా కప్లో ఇండియా-ఏ జట్టు సెమీస్లో ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో భారత్ 20 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత అఫ్గాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అనం తరం 205 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన భారత్-ఏ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులకు పరిమితమైంది. రమన్దీప్ (64) రాణించాడు.