14 April, 2026 | 5:14 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి,బిడ్డ క్షేమం

02-01-2026 12:00 AM

కేసముద్రం, జనవరి 1 (విజయక్రాంతి): పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సిబ్బంది కాన్పు నిర్వహించి తల్లి బిడ్డను  ప్రాణాలతో రక్షించారు. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రంకు చెందిన గర్భిణీ మైదం పద్మకు పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. హుటాహుటిన ఇనుగుర్తి మండలానికి చెందిన అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకొని 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మా ర్గ మధ్యలో ఆమెకు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో 108 ఈ ఎం టి ఎలమద్రి ప్రభాకర్, పైలట్ రఘు స్పందించి వాహనంలోనే సుఖ ప్రసవం చేసి తల్లీ, బిడ్డల్ని రక్షించారు. తల్లీ బిడ్డను కాపాడిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.