23 June, 2026 | 2:39 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపండి: ఏబీవీపీ డిమాండ్   •   సీసీ రోడ్డుకి భూమి పూజ   •   సహకార సంఘం ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం చేపట్టాలి   •   భూక్యారెడ్డితండాలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఎక్స్‌రే పరీక్షలు   •   ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా: నియోజకవర్గం ఇన్చార్జి   •   రైతులు విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోవాలి   •   యూరియా కోసం రైతుల ధర్నా.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్   •   పోతారంలో చిన్న వానకే చెరువులా ప్రధాన రహదారి   •   ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్   •   శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం   •  

ఆక్రమిత కట్టడాల కూల్చివేత..

22-10-2025 11:28 PM

విజయక్రాంతి వార్తకు స్పందన..

బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం 85 డిపిలో ఆక్రమిత కట్టడాలను సింగరేణి సెక్యూరిటీ అధికారులు కూల్చివేశారు. సింగరేణి భూముల్లో రియల్ దందా శీర్షికతో విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన వార్తకు సింగరేణి అధికారులు స్పందించారు. 85 డీప్ ఏరియాలో ఆక్రమించిన స్థలంలో హద్దుల కోసం ఏర్పడిన సిమెంట్ ఫోల్స్ను కూల్చి వేశారు. సింగరేణి స్థలంలో అక్రమంగా నిర్మించిన ఓ షెడ్డును సింగరేణి సెక్యూరిటీ అధికారులు, సిబ్బంది కూల్చివేశారు. అంతటితో ఆగకుండా సింగరేణి అధికారులు బెల్లంపల్లిలో అక్రమితకు గురైన సింగరేణి భూముల సర్వేను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సింగరేణి ఆక్రమిత భూములను గుర్తించి సర్వే చేసి భూముల లెక్కను తేల్చేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.