13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ప్రజల మన్ననలు పొందుతున్న విజయక్రాంతి

09-01-2026 10:05 AM

పత్రికా యాజమాన్యానికి జర్నలిస్టులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రజా సమస్యలను బహిర్గతం చేస్తూ పరిష్కరించేందుకు దారి చూపిస్తున్న విజయ క్రాంతి దినపత్రిక తక్కువ సమయంలోనే అత్యధికంగా జనాదరణ పొందుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మూఢ కార్యాలయంలో విజయ క్రాంతి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరములు మరింతగా పాఠకులకు అండగా ఉంటూ ప్రభుత్వానికి వారధిగా నిలబడుతూ ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా పత్రిక యాజమాన్యానికి జర్నలిస్టులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయ క్రాంతి మహబూబ్ నగర్ జిల్లా బ్యూరో ఇంచార్జ్ జిల్లెల రఘు, అడ్డాకల్ రిపోర్టర్ శేఖర్, జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.