23 June, 2026 | 8:36 PM

Breaking News

ఎన్నికల సంఘం ఆదేశానుసారంగా హెల్ప్ డెస్క్ ప్రారంభం   •   కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే బర్తరఫ్ చేయాలి   •   బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్   •   ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి   •   పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •  

చదువుతోనే అభివృద్ధి సాధ్యం

24-07-2025 07:11 PM

రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహ రెడ్డి..

భూత్పూర్: చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహ రెడ్డి(Additional Collector Enugu Narasimha Reddy) అన్నారు. గురువారం భూత్పూర్ మండలం అమిస్తాపూర్ సారిక టౌన్ షిప్ లో తెలంగాణ మహాత్మాజ్యోతిరావు పూలే బిసి బాలికల గురుకుల పాఠశాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహ రెడ్డి సందర్శించారు. విద్యార్థినిలు చదువుపై దృష్టి పెట్టి బాగా చదువుకొని జీవితంలో స్థిరపడి సమాజంలో మంచిపేరు తెచ్చుకోవాలని అన్నారు. 

వంట చేసే సిబ్బంది పరిశుభ్రమైన వాతావరణంలో వంట చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న చెప్పాలని, సదుపాయాలను అందుబాటులో ఉంచి మీరు బాగా చదువుకోవాలని లక్ష్యంతోనే ఉపాధ్యాయులంతా శ్రమిస్తున్నారని తెలిపారు. అందుకు తగ్గట్టు బాగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు ఉన్నారు.