23 June, 2026 | 9:47 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ నగర అధ్యక్షురాలుగా అంజలి ప్రధాన కార్యదర్శిగా పద్మ ఎన్నిక

24-07-2025 07:01 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): భారత జాతీయ మహిళా సమాఖ్య ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ కరీంనగర్ నగర సమితి ముఖ్య కార్యకర్తలు సమావేశం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జరిగింది. ఈ సమావేశంనకు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షురాలు కిన్నెర మల్లవ్వ ప్రధాన కార్యదర్శి గరిగె శారదలు హాజరయ్యారు. నగర అధ్యక్షురాలుగా కొట్టె అంజలి, ఉపాధ్యక్షురాలుగా కడారి కావ్య, గుమ్మడి సుజాత, ప్రధాన కార్యదర్శిగా బీర్ల పద్మ సహాయ కార్యదర్శి ఉప్పు శ్రీగుణ, బీర్ల రజిత, కోశాధికారిగా భారతి మరో నలుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు కమిటీని జిల్లా ప్రధాన కార్యదర్శి శారద ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అంజలి, పద్మ మాట్లాడుతూ.. నగరంలో మహిళల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే మహిళా సమాఖ్య బలోపేతం కోసం పనిచేస్తామని అన్నారు.