calender_icon.png 21 August, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమకొండలో ‘ధనైరా సిల్క్స్’

21-08-2025 12:00:00 AM

ప్రారంభించిన బుల్లితెర నటి సుహాసిని

హనుమకొండ టౌన్, ఆగస్టు 20 (విజయక్రాంతి): హనుమకొండలోని తెలంగాణ జంక్షన్ ప్రాంతంలో మంగళవారం ధనైరా సిల్క్స్ వస్త్ర నిలయాన్ని బుల్లితెర నటి సుహాసిని, డైరెక్టర్ కార్తీక్‌రెడ్డి ప్రారంభించారు. నిర్వాహకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరంగల్ చారిత్రక నగరం అని ఈ ప్రాంతంలోని ఆలయాలు, ప్రజలు తనకు ఎంతగానో నచ్చాయని అన్నారు. ధనైరా సిల్క్ యాజమాన్యం మహిళలకు ఎన్నో రకాల పట్టుచీరలను తక్కువ ధరల్లో అందిస్తున్నారని, మహిళలు మెచ్చిన పట్టు వస్త్రాలను పండుగల సమయంలో కొనుగోలు చేసేందుకు ధనైరా సిల్క్ వస్త్ర నిలయం వేదిక అవుతుందని అన్నారు.

రూ.10 వేల కొనుగోలుపై 4 గ్రాముల వెండి నాణెం, రూ.20 వేల కొనుగోలుపై 8 గ్రాముల వెండినాణెం, రూ.50వేల కొనుగోలుపై 20 గ్రాముల వెండి నాణాన్ని బహుమతిగా అందజేయనున్నారు. ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ మహిళలకు 150 మందికి ఉచితంగా చీరలను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు వంగాల భవాని దిలీప్‌రెడ్డి తెలిపారు. పై ఆఫర్లు ఈ నెల 21 నుంచి 27 వరకు వినాయక చవితి పండుగ సందర్భంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు.