24 June, 2026 | 2:29 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

బీసీ రిజర్వేషన్ కోసం ధర్మపోరాట దీక్ష

14-11-2025 12:28 AM

చేగుంట నవంబర్ 13,నార్సింగి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ కోసం ధర్మ పోరాట దీక్షలు చేపట్టారు. గురువారం నార్సింగి ఎస్బీఐ చౌరస్తాలో బీసీ నాయకులు ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ సాధించే వరకు ప్రభుత్వంపై పోరాటం చేయనున్నట్లు తెలిపారు. రానున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రాజేష్, రవిందర్, ముస్లిం నాయకులు రబ్బానీ పాల్గొన్నారు.