calender_icon.png 14 November, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్ కోసం ధర్మపోరాట దీక్ష

14-11-2025 12:28:59 AM

చేగుంట నవంబర్ 13,నార్సింగి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ కోసం ధర్మ పోరాట దీక్షలు చేపట్టారు. గురువారం నార్సింగి ఎస్బీఐ చౌరస్తాలో బీసీ నాయకులు ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ సాధించే వరకు ప్రభుత్వంపై పోరాటం చేయనున్నట్లు తెలిపారు. రానున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రాజేష్, రవిందర్, ముస్లిం నాయకులు రబ్బానీ పాల్గొన్నారు.