03-11-2025 05:26:33 PM
నిర్మల్: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ల సమస్యలు పరిష్కరించి వేతనాలు పెంచాలని కోరుతూ సిఐటియు స్కావెంజర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నాయకులు సురేష్ మాట్లాడుతూ స్కావెంజర్లు 2024 సంవత్సరంలో 4 నెల వేతనం ఇవ్వలేదు. వేతనం వెంటనే విడుదల చేయాలి. ప్రతి నెల నెల సకాలంలో వేతనాలు అందించాలి. జిల్లాలో 700 మంది స్కావెంజర్స్ పనిచేస్తున్నారు ఎక్కడ పూర్తి వేతనం ఇవ్వడం లేదు, వేతనం 3000 రూపాయలు మాత్రమే, కాని వేతనంలో కోతలు పెడుతున్నారు 2000-2500 రూపాయలు ఇస్తున్నట్టు తెలిపారు. పాఠశాల విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా ప్రతి సర్వీస్ పర్సన్ వేతనం పెంచాలి.