12 May, 2026 | 12:09 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిస్వా శర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

పెన్షన్ పెంచాలని వికలాంగులు తాసిల్దార్ కార్యాలయం ముట్టడి

15-09-2025 05:38 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెన్షన్ పెంచాలని వికలాంగుల జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్ కార్యాలయం ముట్టడి చేశారు. వికలాంగుల ఆధ్వర్యంలో తాసిల్దార్ రామారావుకు వినతిపత్రం అందజేశారు. వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకటించిన విధంగా వికలాంగులకు నెలకు రూ.6000 పెన్షన్ పెంచుతాన ని మాట ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా వికలాంగులు , వృద్ధులు, వితంతువులు పెన్షన్ పెంచడం లేదని వెంటనే ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని వికలాంగుల పెన్షన్ పెంచి ఆదుకోవాలని అన్నారు. అంతకు ముందు గ్రామంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అందరూ వీధుల గుండా  ర్యాలీ నిర్వహించారు.