14-11-2025 12:00:00 AM
రాష్ట్రస్థాయి తాంగ్తా పోటీలకు ఎంపిక
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): ఇటీవల మహబూబాబాద్లో నిర్వహించిన జిల్లా స్థాయి తాంగ్ తా పోటీల్లో డిస్నీల్యాండ్ విద్యార్థులు ఐదుగురు ఉత్తమ ప్రతిభ కనపరిచి ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఇది తమకు ఎంతో గర్వకారణమని స్కూల్ యాజమాన్యం దయ్యాల మల్లయ్య, దయ్యా ల సదయ్య, బాలుగు లక్ష్మీనివాసం, శోభారాణి, రాకేష్ భాను, దినేష్ చందర్ తెలియ జేశారు. ఎంపికైన వారిలో కోరె ప్రమోద్ సాయి- (10వ తరగతి), కడారి కార్తికేయ (-10వ తరగతి), దద్దు అభిరామ్ (-8వ తర గతి), ఎల్. విష్ణు (-8వ తరగతి), కసగాని జై గౌడ్ (-7వ తరగతి) ఉన్నారు. కోచ్ వెంకటేష్ను, విద్యార్థులను యాజమాన్యం, ఉపా ధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.