22-12-2025 12:44:21 AM
నాగర్ కర్నూల్, డిసెంబర్ 21 (విజయక్రాంతి) ప్రజా సమస్యల సత్వర పరిష్కార లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని నేటి నుంచి యధావిధిగా నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా ప్రజావాణికి తాత్కాలిక బ్రేక్ పడిందాన్నారు. తిరిగి నేటి నుండి ప్రజావాణి కొనసాగుతుందని స్పష్టం చేశారు.