30 June, 2026 | 7:53 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

రామకోటి పుస్తకాల పంపిణీ

07-04-2025 12:19 AM

కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి మగ్దుం నగర్ లోని ఆంజనేయస్వామి ఆలయంలో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బచ్చు మౌనిక ఆంజనేయులు సహకారంతో రామకోటి పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువజన నాయకులు కొలుకుల జైహింద్, ఎస్‌ఐ శంకర్ హాజరై రామకోటి పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జైహింద్ మాట్లాడుతూ వేసవికాలంలో చిన్నారులలో దైవభక్తిని పెంపొందించడానికి శివాజీ యూత్ అసోసియేషన్ చేసిన ప్రయత్నాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు శివకుమార్ గన్నా రం, సతీష్ షిండే, ఆంజనేయులు గుప్తా, బాచు మౌనిక, వీరేష్, శ్రీ సాయిలు, యశ్వం త్, కూర రాజు తదితరులు పాల్గొన్నారు.