9 April, 2026 | 7:15 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

తోడు నీడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్వెట్టర్ల పంపిణీ

23-12-2025 02:09 AM

మొయినాబాద్, డిసెంబర్ 22 (విజయ క్రాంతి): చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్యం కోసం తోడు నీడ ఫౌండేషన్ అండగా నిలిచింది. మొయినాబాద్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామం గలలో ప్రభుత్వ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరి స్వెట్టర్లను అందజేశారు.ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ.. శివారు గ్రామాల్లోని నిరుపేద విద్యార్థులు చలి తీవ్రత వల్ల పడుతున్న ఇబ్బందులను గమనించి. విద్యార్థులకు స్వెటర్లు పంపిణీ చేశామని, విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలనే ఉద్దేశంతో తమ ఫౌండేషన్ తరపున ఈ చిన్న సాయం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సెక్రటరీ రాజేష్, పాఠశాల హెడ్ మాస్టర్,ముజీబ్ ,రవీందర్ , శివ కుమార్, పూర్ణ చంద్రరావు,శకుంతల, కవిత, సుధాకర్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు రాజేశ్వరి, రాజేష్ లకు ధన్యవాదాలు తెలుపుతూ.. పదవతరగతి లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తామని చెప్పారు.