20 March, 2026 | 7:51 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం ప్రారంభం

26-05-2025 12:48 AM

యాదాద్రి భువనగిరి, మే 25 (విజయక్రాంతి): భువనగిరి పట్టణంలోనీ కన్యకా పరమేశ్వరి కాలనీలో నూతనంగా నిర్మించిన యాదాద్రి భువనగిరి జిల్లా రైస్ మిల్లర్స్  అసోసియేషన్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదివారం నాడు ప్రారంభించారు.  అనంతరం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మార్త వెంకటేశం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైస్ మిల్లర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ  మిల్లర్స్ సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వెండింగ్ బకాయిలను  ఇప్పించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. రైతులు పండించిన పంటను కొనేందుకు ఈసారి కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేసి రైతులకు మరియు రైస్ మిల్లర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవేజ్ చిస్తి,రైస్ మిల్లర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గంపా నాగేందర్, వి.మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టి చంద్రపాల్ రాష్ట్ర కోశాధికారి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోట మల్లారెడ్డి,జిల్లా కోశాధికారి గౌరిశెట్టి అశోక్, వివిధ జిల్లాల అధ్యక్షులు మరియు రైస్ మిల్లర్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.