17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

జిన్నారం పీహెచ్‌సీ తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

02-05-2025 01:09 AM

పటాన్ చెరు/జిన్నారం,  మే 1 :మండల కేంద్రం జిన్నారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్వో గాయిత్రిదేవి గురువారం తనిఖీ చేశారు. నూతనంగా నిర్మించి న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆసుపత్రికి వస్తున్న వారికి అందుతు న్న వైద్య సైవలపై ఆరా తీశారు. ప్రసూతి సౌకర్యాలపై గ్రామాలలో అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.

ప్రస్తు తం పద్నాలుగు మందికి ప్రసూతి సౌకర్యం కల్పించినట్లు వైద్యురాలు కోమలి తారక్ డీఎంహెచ్వోకు తెలిపారు. ప్రతి గురువారం నిర్వహించే ఓపీకి మరింత ప్రచారం కల్పించి అందరికి తెలియజేయాలన్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వ చ్చంద సంస్థలు ముందుకు రావాలని కోరా రు. వైద్యులు, సిబ్బంది పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యం కోసం వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలన్నారు.