28 June, 2026 | 2:17 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

అయ్యప్ప స్వామి ఆలయానికి ఐదు లక్షల విరాళం

05-12-2025 11:39 PM

నిజాంపేట,(విజయక్రాంతి): నిజాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి శుక్రవారం మేడ్చల్ పట్టణానికి చెందిన గడ్డం లక్ష్మి శ్రీరామ్ గౌడ్ దంపతులు ఆలయ నిర్మాణం కోసం రూ.5 లక్షల విరాళాలని ప్రకటించారు. ఈ సందర్భంగా గురుస్వామి రంజిత్ గౌడ్ మాట్లాడుతూ.. నిజాంపేటలో అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో అయ్యప్ప ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించాం.

ఆ హరిహర పుత్రుని ఆలయం నిర్మాణం కోసం ఎవరైనా దాతలు ముందుకు వచ్చినట్లయితే ఆలయ నిర్మాణంలో తమ వంతు కృషి చేసిన వారు అవుతారని అలాగే ఆలయ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ వారి పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఆలయ నిర్మాణానికి 5 లక్షల విరాళాన్ని ప్రకటించడం అయ్యప్ప స్వాములకు అన్నదాన భిక్ష ఏర్పాటు చేసిన గడ్డం లక్ష్మీ శ్రీరామ్ గౌడ్ కుటుంబ సభ్యులకు అయ్యప్ప ఆశీస్సులు అనుగ్రహం ఉండాలన్నారు.