17-11-2025 01:10:00 AM
చౌటుప్పల్, నవంబర్ 16(విజయక్రాంతి): చౌటుప్పల్ మున్సిపాలిటీ వలిగొండ రోడ్డు లోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వాములు , భక్తుల సౌకర్యార్థం కోసం చౌటుప్పల్ పట్టణ కాంగ్రెస్ నాయకులు బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ తన సొంత నిధులతో బోరు వేయించి అలాగే దేవాలయం ముందు షెడ్డు కు విరాళంగా ధన రూపేనా సహకారం అందించినందుకు దేవాలయ కమిటీ సభ్యులచే బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ కు ప్రత్యేకంగా శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగిల రామచంద్రం, ఉపాధ్యక్షులు చింతల ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి ఎలుక రాజు నాగరాజు, అధ్యక్షులు ఉష్కాగల శ్రీనివాస్, తూర్పునూరు నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.