26 April, 2026 | 8:05 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి

02-07-2025 12:00 AM

ఎంపీడీఓ శ్రీనివాస్ రావు

పెన్ పహాడ్, జూలై 1 :  ప్రతి ఇంటిలో తప్పక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ఎంపీడీఓ శ్రీనివాస్ రావు అన్నారు. మంగళవారం మండలంలోని అనంతారం గ్రామంలో సాచ్యురేషన్ పద్ధతిలో ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం కోసం ముగ్గులు పోసి గ్రామస్తులకు ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించారు. తమ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రభుత్వం రూ. 6వేలు అందిస్తుందన్నారు.

అలాగే ప్రస్తుతం వర్షాకాలం సమీపించినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు. గ్రామాల్లో పైపులు లీకేజీ అయిన వెంటనే సిబ్బంది ఎప్పటికప్పుడు పైప్ లైన్ లీకేజీలను మరమ్మతులు  చేయాలన్నారు. కార్యక్రమం లో ఏపీఓ రవి, ఈసీ మహేష్, ఏకస్వామి, రాంకుమార్, బేగం తదితరులు ఉన్నారు.