12-05-2025 02:26:26 AM
ప్రకటించిన బర్మేర్ జిల్లా యంత్రాంగం
న్యూఢిల్లీ, మే 11: పాకిస్థాన్ కాల్పుల విరమణను మరోసారి ఉల్లంఘించి డ్రోన్ దాడులు చేసినట్టు సమాచారం. రాజస్థాన్లోని బర్మేర్లో డ్రోన్లు కనిపించాయని ఆ జిల్లా యంత్రాంగం ఎక్స్లో పోస్ట్ చేసింది. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని, స్థానికంగా బ్లాకౌట్ విధించినట్టు పేర్కొంది. అయితే ఈ దాడులను ఆర్మీ నిర్ధారించలేదు.