29-10-2024 01:38:11 AM
నిర్మల్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన ఉపకార వేతనాలు, ఫీజు రియింబర్స్మెంట్ బకా యిలను వెంటనే చెల్లించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారు వారు పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులతో కలిసి నిర్మల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ నుంచి ఆర్డీవో కార్యాల యం సాగింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు శైలేందర్, శశిధర్ మాట్లాడుతూ.. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.