20-09-2025 06:09:37 PM
బోయినపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం ప్రభుత్వ పాఠశాలలో, ఆనంద్ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో, రూసో బీఈడీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మహిళా ఉపాధ్యాయులు రంగురంగుల పూలతో బతుకమ్మ పేర్చి బతుకమ్మ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రవణ్ కుమార్, ఆనంద్ విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ బిల్లా ఆనందం తదితరులు పాల్గొన్నారు.