26 April, 2026 | 8:58 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

బీహార్ డిప్యూటీ సీఎంకు ఈసీ నోటీసులు

12-08-2025 01:35 AM

డబుల్ ఓటర్ ఐడీ ఆరోపణల నేపథ్యం 

పాట్నా, ఆగస్టు 11: బీహార్ ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఓటర్ ఐడీలు కలిగి ఉన్నారని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ఈసీ బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాకు నోటీసులు జారీ చేసింది. ‘సిన్హాకు నోటీసులు జారీ చేశాం. ఆయన రెండు ప్రాం తాల్లో ఎందుకు ఓటర్ ఐడీ కలిగి ఉన్నారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నాం’ అని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు.

విజయ్ కుమార్ సిన్హాకు రెండు నియోజకవర్గాల్లో ఓటరు కార్డులున్నాయని ఆరోపించిన తేజస్వీ ఒక దాంట్లో అతడి వయసు 57 సంవత్సరాలుగా ఉండగా.. మరోదాంట్లో 60 సంవత్సరాలుగా ఉందని పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. సీ చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపెను దుమారం రేపుతోంది.